Full width home advertisement

Post Page Advertisement [Top]


ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమ సమయంలో కవి పాత్రోచిత సందర్భాన్ని బట్టి వివిధాలుగా రచించిన పాటల్ని ప్రముఖంగా చర్చిస్తే, ఈ వారం మాత్రం అచ్చంగా కవి సమయమే. పాట సమయం. పాటపై పాట రాసిన భిక్షపతి కవి సమయం. ఒక ప్రామిసింగ్ పాట రాసిన కవిగాయకుడి సమయం ఇది. నిన్ను విడిచి ఉండలేనమ్మా...ఓ పాటమ్మా అంటూ పాట వెంటే ఉంటానని ప్రమాణం చేసిన ఒక ప్రామిస్‌ంగ్ పోయెట్ కవితా సమయం.

మొత్తం తెలంగాణ సమాజంలో ఒక ప్రక్రియగా పాట ఎంత పని చేసిందో, ఎన్నెన్ని విధాలా కాంట్రిబ్యూట్ చేసిందో, అందలి కవితా న్యాయం ఎసొంటిదో పారాయణం చేసే గొప్ప పాట ఇది. ఒక రకంగా తెలంగాణ చైతన్యవంతం కావడానికి ఉపకరించిన అన్ని పాయల్ని, ఛాయల్ని దశ్యమానం చేసి వదిలిపెట్టే పాట. తెలంగాణ ఈడిదాకా రావడానికి కారణమైన ప్రస్తావనల పాట. అది ఒక్కొక్కర్నీ యాది చేస్తది. ఒరిగిన బిడ్డలు, వాళ్ల ఆశయాలు అన్నీ గుర్తు చేస్తది.

ఈ పాట ఒక రకంగా తెలంగాణ ముద్దుబిడ్డలందర్నీ ముద్దాడి, వారిని జాగురూకతలో వుంచే పాట. ఒక చరిత్ర గానం. పాటగాళ్లను సగర్వంగా తలకెత్తుకోవాల్సిన తరుణంలో ఈ పాట ప్రాసంగికత ఇపుడు ఇంకా ఎక్కువ. రాసింది భిక్షపతి. ఒకనాడు కొడుకా నా ముద్దుల కొడుకా అని పాట రాసి పాడగా వాచ్‌మెన్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న పాటగాడి పాట. పాటే జీవితంగా చేసుకున్న ఒకడి ఉద్యమ కాలం, ఈ నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా...
ఈ పాటను తొలుత నాలుగేళ్ల క్రితం గోదావరిఖనిలో పాడిండట.

తర్వాత ధూందాం వేదిక మీద పాడిండు. లలిత కళా తోరణంలో. అంతే. అప్పటినుంచి పాటల వేదికగా ఉన్న ధూందాంకు ఈ పాట బొడ్రాయిగా మారింది. పాటలెన్ని పాడినా పాటపై రాసిన ఈ పాట పాడితేగానీ సభ, ఆ సమావేశం పూర్తికాదు. అందుకు కారణం, మలిదశ ఉద్యమంలో పాటది ఒక ప్రశస్తమైన పాత్రయితే ఆ పాత్రను, దాని సుదీర్ఘమైన, విస్తారమైన చరిత్రను సంక్షిప్తంగా పదమూడు చరణాలతో అల్లి, ఆ పాట నిశ్శబ్ద కషిని ఇందులో తలచుకోగలగడం. ఒక రకంగా ఇది కార్యకర్తగా మారిన మన సమాజం ఒక్కపరి శ్రోతై వినే పాట. విని ఉప్పొంగే పాట. తమ కషిని తామే విని సంతసించే పాట.

ఈ పాటలో ప్రముఖ కవిగాయకులను పేర్కొంటూ వాళ్ల కషిని అపూర్వంగా తల్చుకోవడం ఉన్నది. పాట గాయపడ్డ వైనమూ ఉంది. పాట నూరిపోసిన ధైర్యమూ ఉన్నది. పాట జైలుకు వెళ్లడం ఉన్నది. కడుపులో ఎన్ని తూటాలు పడ్డా కలత చెందని మనసు ఉన్నది. ప్రాంతేతరులు మన పాటను, దాని యాసను, భాషను ధ్వంసం చేసి బాధపెట్టడం పట్ల వేదనా ఉన్నది. రాసిన వాడు గాక ఇంకొకడు పేరు మోసినప్పటి కవి దుఃఖమూ ఉన్నది. పీడనను ఎదిరించించిన పాట కవిత ఇది. ఒక రకంగా పాటకు ముందు మాటలా ఒక కవి కైగట్టడం ఇది. పాటకు సమయం రావడం వల్ల తెలంగాణ తనని తాను ఆప్యాయంగా తడుముకున్న సందర్భం ఈ పాట.

ఇంకా చాలా ఉన్నయి. పాట రైతుల హక్కులను సాకారం చేసేందుకు చేసిన కషీ ఉన్నది. గులాం గిరీ చేయకుండా నిలదొక్కుకున్న తీరూ ఉన్నది. పాటను అమ్మగా పేర్కొంటూ, పది కాలాల పాటు చల్లగుండమని చెప్పే దీవెనా ఉన్నది. మొత్తంగా తెలంగాణ నడిచి వచ్చిన దారులన్నిటా కలియ తిరుగూతూ ఒక చిరుగాలిలా ప్రారంభమై తుదకు చుట్టేసి, పలు రీతులా హదయాలు శుభ్రం చేస్తూ ఆర్తితో, ఆవేదనతో, మమతానురాగాల మాలికగా ఈ పాట నడిచినది. అందులో చెప్పుకోతగ్గ వినయమూ విధేయతా ఉన్నది. ఆ లెక్కన ఈ పాట గొప్ప కాంట్రిబ్యూషన్. దీన్ని వారం దినాలల్ల రాసిన అన్నడు భిక్షపతి. అయితే, ఎందుకు రాసిన్నో ఒక్క మాటలో చెప్పవశం అయిత లేదు అన్నడు. కానీ, ట్రై చేసిండు. చెప్పిండు.

ఆ దినం రాత్రయింది. పాటలు పాడి వస్తున్నరు. తానూ, తన మేనకోడలు అశ్విని. బస్సుల్లేవు. పన్నెండు గొట్టింది. పోలీసులు పట్టుకుంటే పాటలు పాడి వస్తున్నం అన్నరు. వాళ్లు వినలేదు. స్టేషన్‌కు తీస్కపోయిండ్రు. అప్పుడు గద్దర్‌కి, గోరటి వెంకన్నకు ఫోన్లు చేస్తే విడిచిపెట్టిండ్రట. నిజంగనే వాళ్లు పాటలు పాడుతరు అని అన్నంకనే విడిచిపెట్టిండ్రట. నిజంగనే పాటలు పాడించుకుని మరీ విడిచిపెట్టిండ్రట. ఇట్లా ఆ రాత్రి నన్ను విడిచి పెట్టడానికి కూడా పాటనే కారణం అని యాజ్జేసుకున్నడు భిక్షపతి. అయితే, అదే రాత్రి ఇంటికొచ్చినంక మాకు ఈ బాధలేంది అని విచార పడ్డడట.

ఆ వేదన నుంచి పాటను పరిపరి విధాలా తల్చుకున్నడట. తాను పుట్టింది, పెరిగింది, తనకు పాటలు ఎట్ల రాయబుద్దయింది, పాట రాసినందుకు ఉద్యోగం పోగొట్టుకున్నదీ, కడుపు నిండా తినని రోజులు. ఉద్యమంలో పడ్డ బాధలు. అన్నీ తలంపుకు తెచ్చుకోగా అట్లట్ల మొదలై, తాను బహువచనమై, కవి సమయం అయి, ఆ రాత్రి కురిసిన బాధలా, చినుకు చినుకు కురిసి వర్షం అయినట్టు చివరకు అమతం కురిసిన రాత్రిలా దేవరకొండ భిక్షపతి ఒక మాతస్థన్యం వంటి పాట రాసిండు. అదే,నిన్ను విడిచి ఉండలేనమ్మా...ఓ పాటమ్మ. ఎన్నడూ మరచిపోనమ్మా..నా పాటమ్మ.

నిజానికి ధూందాంలో ఈ పాట పాడకముందు తాను జిల్లా స్థాయికే పరిమితం. తర్వాత తాను తెలంగాణం. ఇట్లా మలిదశ ఉద్యమంలో తాను ఎన్ని పాటలు రాసినప్పటికీ తెలంగాణ దక్పథం, వారసత్వం, విప్లవం అన్నీ కలగలసిన ఒక పాట రాయడం, అది ధూందాం ద్వారా ప్రతి హదయాన్ని చేరుకోవడం తనకు నిజంగానే ప్రాచుర్యాన్ని ఇచ్చింది. అమిత సంతోషాన్ని పంచింది. పాట తనకు ఇసొంటి జన్మనిచ్చినందుకు సాలురా అనుకుంటడట.

చిన్న అనుభవం. ఒక దగ్గరకు పోతుంటే, ఆటోలో తన పాటే. ఈ పాటే. వెన్క ఇద్దరు టీచర్లు. అందులో ఒకాయన ఏమున్నది. ఈ పాట ఎవరు రాసిండ్రో అని అంటే, ధన్‌మని డ్రైవర్ అంటడట...ఆ బిక్షపతి మావోడే. నా సోపతిగాడే అని! ఆ మాటకు ప్రయాణిస్తున్న భిక్షపతి, తన తండ్రీ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నరట. చిత్రమేమిటంటే, ఆ డ్రైవర్‌కి తాను తెలియదు. కానీ ఓన్ చేసుకోవడం. ఇట్లా ఎవరైనా మా వోడే రాసిండని చెప్పుకునేంతటి స్థితి. ఇది తన అనుభవం అని కాదు. కవులందరూ పాట వల్ల పడ్డ ఆనందాతిశయం. దాన్ని కూడా ఈ పాటలో ముట్టుకున్నడు.

ఎన్ని కష్టాలు పడ్డా ఇదొక సంబురం. అయితే, తన పాటలో సరళత్వం, అందులో ఉన్న సార్వజనీన తెలంగాణ జీవితం, ఇష్టులను చేస్తుంది. మామూలు శ్రోతలనే కాదు, ఇతర కవిగాయకలనూ! అదీ ఈ కవి సాధించిన సాఫల్యత. నీతోడు ఉంటె ఏ బాధ ఉండదని తెలువనోళ్లు కొందరు. అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయేవాళ్లు ఎందరో అని చెప్పి పాటే తన భాగ్యం అని సగర్వంగా చెపుకుంటడు.
పాట చాలా సింపుల్‌గనే ఉంటది. కానీ, విన్నకొద్దీ అందులోని గాఢత తెలిసి వస్తది. ప్రతి మదిలోన మెదులుతూ ఉంటవో పాటమ్మ... అని సార్వజనీనంగా అందరిలో ఉండే ఆర్తిని యాది చేస్తడు.

అదే సమయంలో నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మ అని ముక్తాయిస్తడు. ఇట్లా, అటూ- ఇటూ రెంటినీ జమాయిస్తడు భిక్షపతి. కవిని, శ్రోతనూ దష్టిలో వుంచుకుని పాట గడతడు. వినేవాళ్లది కవి హదయమైతే ఈ పాటను ఇంకా ఎంజాయ్ చేస్తరు. అదే సమయంలో తన వంటి వాడికి కూడా నువ్వు లేకపోతే నేనెవరో తెలియదమ్మా అనీ అంగీకరింపజేస్తడు. ఇక్కడ నేనెవరో అనడంలో తనకు ఉనికిని చూపిన పాటకు అమితాభిమానంతో కతజ్ఞతలు అర్పిస్తడు. ఇట్లా, స్వయంగా ఒక కవి తన జీవిత ఇతివత్తాన్ని లేదా తన పాణాన్ని చరణాలుగా చుట్టి ప్రపంచంలోకి విడిచిపెట్టి, భావోద్వేగాలకు గురిచేసి మళ్లీ వాటన్నిటినీ ఒక చుట్టచుట్టుకుని పేగులోలె మళ్లీ తన కడుపున దాపెట్టుకున్నట్టి పాట ఇది. రాసిన భిక్షపతి ధన్యుడు. విన్న వాళ్లం కతజ్ఞులం.

తాను వ్యవసాయ కూలీ బిడ్డ. అమ్మ సత్తెమ్మ. నాయిన వెంకటయ్య. ఇంటర్ డిస్‌కంటిన్యూడ్. ఇద్దరు అక్కచెల్లెండ్లూ ఇద్దరు అన్నదమ్ముల కుటుంబం. కానీ, పాటకు నిలబడ్డడు భిక్షపతి. భార్య ప్రేమ అంటనే ఉంటది, ఏందయ్యా...పని చేస్తనన్నవు, పాటల్నే పట్టుకుని తిరుగుతున్నవు అని. కానీ, తనకు పాటే జీవితం అయింది. చిన్నప్పుడు జయరాజన్న, నాగన్న, కానూరి బయ్యారంలో డప్పేసుకుని ఊరు మనదిరా.. అని పాడినప్పుడు పడ్డది.

ఈ దొర ఏందిరో దోపిడేందిరో అని ఎలుగెత్తి పాడినప్పుడు అనిపించింది, మనం గూడ ఇట్ల పాడాలి. రాయాలీ అని. అట్ల రాయడం ప్రారంభం. తర్వాత కష్టాలు, నష్టాలు, అందులోనే పాటా ఆటా. సుఖం. అమ్మానాన్నల సంపాదనేమి లేదు. తాత తండ్రుల నాటి ఆస్తిపాస్తులు లేవు అన్నది ఎంత నిజమో...నిన్ను నమ్ముకొనే బతుకుతున్నము.. ఓపాటమ్మ అనడమూ అంతే నిజం. ఇది కవి సమయం. వందలాది పూర్తికాలం కవుల తెలంగానం సమయం.
ఇక్కడో విషయం. తన పిల్లలకు తాను పేరు పెట్టుకున్న తీరు గమనిస్తే తనలో ఎసొంటి కవి హదయం ఉన్నదో తెలుస్తుంది. అవును. అబ్బాయి తుఫాన్ కుమార్.

అమ్మాయి వరదా రాణి. నిజమే. విపత్తులు. వాటిని కూడా సహజంగా చూడటం తన కవి హదయం. అయితే, ప్రకతి విలయాలనూ తాను అర్థం చేసుకుంటడు. కానీ, మనిషి తీరుతెన్నులే తనని కలచి వేస్తయి. అనివార్యంగా కవిని చేస్తయి. కవి సమయం అంటే అదే. ఇదే తన పరిమితి, విస్తతి. ఎట్లా అంటే, దోపిడీ, పీడన, పోరాటం. సమాజాన్ని పునర్నిర్మించడం, అందుకు పాటే విప్లవాన్ని నూరిపోయడం, సంఘటితం చేయడం, మార్పుకు పూనుకోవడం. తెలంగాణలో పాట ఇట్లా ప్రముఖ పాత్ర వహించడాన్ని తాను కైగట్టిండు. నిన్ను విడిచి ఉండలేనమ్మ అన్న పాట ఒక రకంగా దశాబ్దాలుగా తెలంగాణలో ఏం జరిగింది, జరుగుతున్నదో చెప్పకనే చెప్పే పాట.

ఈ పాట మొత్తం ఇరవై చరణాల దాకా ఉందిగానీ ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం పదమూడు చరణాలు. మొదట ట్రాక్ మీద గర్జన పాడినప్పటికీ ఇంత పాణంతోని రాసుకున్నవు. నువ్వే పాడరాదురా అని గద్దరన్న చెప్పడంతో నేనే పాడిన అని వివరించిండు భిక్షపతి.

ఉద్యమానికి ఊపిరిలూదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటవు. ఊరె సెలిమలాగ గోరటి వెంకన్న చేతివెంట రాలుతుంటవు. ఊరూరా దొరలకు ఎదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మ...జయరాజన్న వెంట జైలుకు వోయి జంగ్ సైరనూదినావమ్మ అని తొలి చరణం. ఇందులో మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన పాటమ్మను గద్దరన్న వెంట ఉరుకుతున్నదని చెప్పడంలో కవి ప్రథమ పాధాన్యం తెలంగాణ ఉద్యమ ఒరవడిదే అని చెప్పకనే చెబుతడు. ఖమ్మం జిల్లా బయ్యారం మా ఊరు. ఉద్యమాలు లేకుంట పాటెక్కడిది అని కూడా అంటడు. పీడీఎస్‌యు. న్యూడెమెక్రసి, అరుణోదయ. నాగన్న, జయరాజన్న తదితరుల స్ఫూర్తితో వారి వెంట తిరిగి ఉద్యమంలో వికసించిన తన రోజులనూ యాది చేసుకుంటడు.

పాటలో చాలా ఉంటై. పల్లవి తర్వాత వచ్చే రెండో చరణం కవులను ప్రస్తావిస్తే చివరి చరణం కన్నా ముందు చరణంలో శంకరన్న, సారంగపాణిలను గుర్తు చేసుకుంటూ గాయకులకు యాది చేస్తడు. అలాగే ఈ చరణంలోనే సుద్దాల హన్మంతు, సుబ్బారావు పాణిగ్రాహిల ఒరవడిని, అట్లే చిందు ఎల్లమ్మను యాది చేసుకుంటడు. పాటను పేరుపేరునా సుసంపన్నం చేయడంతో పాట వింటుంటెనే వాళ్లు కండ్ల ముందు కదలాడి వాళ్ల గానం, కళలతో పాట హదయాలను మరింత హత్తుకుంటుంది.

కాగా, పాటను తాను నిర్మించిన పద్ధతి చూస్తే, అందులో ఒక విశదరీతి ఉన్నది. నిజానికి ప్రసంగరూపం ఉన్నప్పటికీ గొప్ప గాయక లక్షణమూ ఉన్నది. బోధపర్చడం ఉన్నది. వందనాలు అర్పించేలా చేయడమూ ఉన్నది. అయితే తన ఒరవడి ఇదే. విశదీకరించడం. అన్ని పాటల్లోనూ అదొక అంతఃస్సూత్రంగా ఉంటది. అయితే తన పాపులర్ పాటల్ని గమనిస్తే, ఒక ఐదు చూడొచ్చు.

ఒకటి, అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది, నిన్ను విడిచి ఉండలేనమ్మ అన్న పాటే. ఇది ఈ కవిని కవిగా తప్పా ఇంకో బతుకు లేని స్థితిని పాడుకునే పాట, అట్లే సగౌరవంగా చరిత్రలో తెలంగాణ పాట చేసిన మహత్తరమైన కార్యాన్ని బోధపర్చే పాట. రెండోది, అమ్మా నన్ను అమ్మకే... అన్న పాట. పిల్లల్ని అమ్మవద్దని, బిడ్డే తల్లికి నివేదించుకునే ఆర్థ్రగీతం. మూడోది ఓ వెలిగే వెన్నెలమ్మా...చల్లని జాబిలమ్మా ఇది ఒక తల్లి తన బిడ్డ శవం పక్కన కూచొని రోదిస్తున్నప్పుడు, ఆ దుఃఖశోకాన్ని తానే బిడ్డయి స్వీకరించి, తల్లి ఎడబాటును అపూర్వంగా ఆలపించిన కవిత్వం. దీన్ని తన మేనకోడలు పాడితే వినాలి. ఏడ్వనోడు మనిషికాదు. ఆసొంటి పాట అది. నాలుగోది, నా పల్లెతల్లి మర్చిపోయి వుండలేక...నేనెక్కడున్నా నా పల్లె సల్లగుండాలి రన్న అన్న పాట. ఇది పల్లె మమకారం ప్రధానంగా సాగుతుంది.

ఆ తర్వాత సిటీకేబుల్లలో, జిల్లాలలో మస్తు ఫేమస్ అయిన పాట...ఉద్యోగం జేస్తనంటివిరా బుచ్చయ్యా...ముద్దుగ నన్ను జూస్తనంటివిరో బుచ్చయ్య అన్న పాట. ఇది నిజానికి తన భార్యమీద రాసిండు. పని చేస్తనని, పాటలు వాడుకుంట తిరుగుతున్న తన స్థితిమీదే, తన భార్య దిక్కు నుంచి రాసిన పాట. అట్లా తాను ఎన్నో పాటలు రాసిండు. వాటన్నిటిలో కవితాన్యాయం ఏమిటీ అని గనుక గమనిస్తే ఒక అస్తిత్వం ఉంటుంది. అది దెబ్బతిని ఉంటది. దాన్ని విశదీకరించడానికి స్వీయాత్మక ధోరణిని అవలంభించడం వుంటుంది. అదే మలిదశ ఉద్యమం ఇచ్చిన బలిమి.

నిజం మరి. ఈ కవి స్వయంగా కష్టజీవి. దళితుడు. ఎస్సీ. తానే కాదు, తెలంగాణంలోని ప్రముఖ కవిగాయకులంతా వెలివాడల్లో పురుడు పోసుకున్నవారే. పల్లె తల్లి కడుపు పంట అయినోళ్లే. అందుకే వెలివాడను కవి చివరి చరణంలో ఆర్ధ్రంగా తడుముకుంటూ, తెలంగాణ తల్లి చెంతకు వస్తడు. పాటమ్మను తోబుట్టువుగా పరిచయం చేస్తడు. ఆడిబిడ్డగా అప్పజెప్పుతడు. మొత్తంగా గొప్ప ఔదార్యంతో, శిరసు వంచి పాదాలను ప్రణమిల్లిన రీతిలో ఇట్లా ప్రతి చరణం పాటకు మొక్కుతది. ముగింపుగా ఏ తల్లి ఈ జన్మనిచ్చిందోగానీ ఓ పాటమ్మా...పదికాలాల పాటు సల్లగుండాలే అంటూ, నా తల్లి నీకు వందనాలమ్మా అని కవి తన మాతమూర్తినే తల్చుకుంటున్నడా అన్నట్టు పాటను ముగిస్తడు. అట్లా పాటతల్లి రుణం తీర్చుకున్నడు భిక్షపతి. అటువంటి మన కాలపు కవికి వందనం. తన గానానికి అభినందనం.
కందుకూరి రమేష్ బాబు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]