తీయనైన తెలుగు తెలంగాణా వెలుగు
శ్రీ విళంబినామ ఉగాది కానుకగా తీయనైన తెలుగు-తెలంగాణ వెలుగు పేరుతో చిన్న పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ అందజేయనున్నది.
తెలంగాణ దర్వాజలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని పొందుపరిచి మొదటిపేజీని డిజైన్ చేశారు. మొదటిపేజీ నుంచి చివరిపేజీ వరకు మామిడి తోరణాల చిత్రాలున్నాయి. చివరిపేజీలో తెలంగాణ తల్లి బొమ్మ, తెలంగాణ కళలు ఆకర్షణీయంగా ఉన్నాయి.